పాత నగదు మార్పిడి చేస్తామని వ్యాపారిని మోసం చేసిన కానిస్టేబుళ్ళు
పాత నగదు నోట్లను మార్పిడి చేస్తామని చెప్పి కానిస్టేబుళ్ళ సహాయంతో స్నేహితుడిని మోసం చేశాడు ఓ వ్యక్తి. ఖైరతాబాద్ సమీపంలోని ఎంఎస్ మక్తాకుచెందిన మల్లేష్ వికారాబాద్ లోని తన స్నేహితుడు ప్రశాంత్ కు ఫోన్ చేసి
పంజగుట్ట : పెద్ద నగదు నోట్లను మార్పిడి చేస్తామని వ్యాపారిని మోసం చేశారు కానిస్టేబుళ్ళు. కానిస్టేబుళ్ళ సహయంతో స్నేహితుడే ఈ పథకం పన్నాడని ఆలస్యంగా గ్రహించాడు ప్రశాంత్ అనే వ్యాపారి.మోసపోయాయని తెలుసుకొన్న బాధితుడు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు.
హైద్రాబాద్ ఖైరతాబాద్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో నివసించిే మల్లేష్ తన స్నేహితుడు ప్రశాంత్ కు ఫోన్ చేసి పాత నగదును మార్పిడి చేస్తానని నమ్మించాడు. వికారాబాద్ లో ప్రశాంత్ చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
రద్దైన పాత నోట్లను మార్చుకొనేందుకు ప్రశాంత్ ఇబ్బందిపడుతున్నాడు. అయితే మల్లేష్ ఫోన్ రావడంతో తనకు మంచి అవకాశం వచ్చిందని భావించాడు. తన వద్ద ఉన్న 2.48లక్షల రద్దైన కరెన్సీని తీసుకుని పంజగుట్టకు వచ్చి మల్లేష్ ను కలిశాడు.
మల్లేష్ ప్రశాంత్ ను తీసుకొని సోమాజీగూడలో పాన్ షాపు నిర్వాహకుడు అఫ్సర్ వద్దకు తీసుకెళ్ళాడు. అఫ్సర్ బాలకిషోర్ లతో పాటు పంజగుట్ట కానిస్టేబుళ్ళు ప్రవీణ్, సుబ్బరాజు , హోంగార్డు రామకృష్ణ పథకం ప్రకారం ఆ డబ్బును దొంగిలించారు. తాను మోసపోయాయని గ్రహించిన బాధితుడు ప్రశాంత్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.