ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం..ఓటాన్ బడ్జెట్కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందు ప్రగతి భవన్లో మంత్రులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారు. కేబినెట్ సమావేశంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చర్చించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు సీఎం కేసీఆర్. అంతకంటే ముందు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం బడ్జెట్కు ఆమోదం తెలపనుంది.
ఇదిలా ఉంటే ఈ సారి తెలంగాణ బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికల సందర్భంగా నాడు కేసీఆర్ ఇచ్చిన హామీలతో బడ్జెట్ పెరిగిపోయిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక శుక్రవారం సీఎం కేసీఆర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ను కేసీఆర్ ప్రవేశపెడతారు.