కడుపుకోత మిగిల్చిన అతివేగం: కారు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వినాయక నిమజ్జనాలను చూడాలని కారులో బయలుదేరి వచ్చిన నలుగురిలో ముగ్గురు యువకులు అతివేగం కారణంగా ఊహించనిరీతిలో మృత్యువాత పడ్డారు. వారి ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకొన్న తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగిల్చారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థులు.
బంజారాహిల్స్లోని రోడ్డు నెం 3లో ఓ మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. కారు ఓ దుకాణంలోకి దూసుకెళ్లగా కారు నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మృతులు ఉప్పల్లోని స్వరూప్నగర్వాసులుగా గుర్తించారు. శరత్చంద్రగౌడ్(23), మామిడాల తేజ(23), నరేన్ సాయి(23) మృతి చెందగా, కార్తీక్రెడ్డి(23) తీవ్రంగా గాయపడ్డాడు.
కార్తీక్రెడ్డి పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యులు తెలిపారు. కాగా, కారులో మద్యం సీసాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
నుజ్జునుజ్జయిన కారు
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
వినాయక నిమజ్జనాలను చూడాలని కారులో బయలుదేరి వచ్చిన నలుగురిలో ముగ్గురు యువకులు అతివేగం కారణంగా ఊహించనిరీతిలో మృత్యువాత పడ్డారు.
కారు ప్రమాదం
వారి ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకొన్న తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగిల్చారు.
కారు ప్రమాదం
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.