హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందేసి, వేగంగా.. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్.. కారు-బైకు ఢీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద బైక్‌ను కారు ఢీ కొంది. ప్రమాదంలో యువకుడు మృతిచెందగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి అతివేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.

మదాపూర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తోన్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తోన్న బుల్లెట్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బుల్లెట్‌పై ఉన్న అభిషేక్ ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

car hit bullet in hyderabad hitech city, one dead

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను ఢీ కొట్టిన కారు డ్రైవర్ కే అశ్విన్‌గా పోలీసులు గుర్తించారు. అతను డ్రింక్ చేశాడని పోలీసులు చెప్తున్నారు.

car hit bullet in hyderabad hitech city, one dead

రాంగ్ రూట్‌లో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో బుల్లెటే కాదు.. కారు కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. వాటిని చూస్తే చాలు కారు ఎంత స్పీడులో ఉందో అర్థమవుతుంది. ఇటీవలే బయో డైవర్సిటీ నుంచి కారు బోల్తాపడటంతో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరునాడే మరో ప్రమాదంలో మరో యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

English summary
hyderabad hitech city monday early morning car hit the bullet. one dead, another injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X