వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ సీఎం కీలుబొమ్మలా మారారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విమానంలో దంపతులు.. భార్య పడుకుంది... పక్కనే భర్త 6 గంటలపాటు....విమానంలో దంపతులు.. భార్య పడుకుంది... పక్కనే భర్త 6 గంటలపాటు....

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అంటే కేసీఆర్‌కు భయమని ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని మండిపడ్డారు.

central minister kishan reddy criticize by telangana cm kcr

ఉద్యమ సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని బీరాలు పలికారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ఒవైసీ సోదరులను తన భుజాలపై కేసీఆర్ కూర్చొబెట్టుకొని ఊరేగుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ బందీగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్, ఒవైసీ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు.

English summary
central minister Kishan Reddy criticized by Telangana CM KCR. KCR had forgotten what was said during the telangana movement. Telangana CM has become a puppet in the hands of MIM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X