పబ్లో మద్యం తాగిన చాందిని, ఫ్రెండ్స్: 52 మంది కోసం 13 రూంలు బుక్
ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చాందినీ, ఆమె స్నేహితులు ఈ నెల 2వ తేదీన విద్యార్థులు హోటల్లో నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ కోసం విడిది చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చాందినీ, ఆమె స్నేహితులు ఈ నెల 2వ తేదీన విద్యార్థులు హోటల్లో నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ కోసం విడిది చేసిన విషయం తెలిసిందే.
చాందినితో తిరిగాడు: నిందితుడి తండ్రి, ఆ ఇద్దరితో హోటల్లో హద్దు మీరి ఉంటుందనే హత్య
పబ్లో మద్యం సర్వ్ చేశారు
చాందిని జైన్, ఆమె స్నేహితులకు పబ్లో మద్యం సర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దీనిని పట్టించుకోలేదని సమాచారం. చాందిని సహా విద్యార్థులంతా మైనర్లు. కాబట్టి వారికి మద్యం ఇస్తే చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
52 మంది విద్యార్థులతో కలిసి
చాందిని కనిపించడం లేదని సెప్టెంబర్ 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు విచారణ జరిపారు. ఆ సమయంలో 52 మంది విద్యార్థులు ఓ హోటల్లో సమ్మిట్ కోసం అంతకుముందు కలిశారని విచారణలో తెలిసింది. వారు ఓ హోటల్లో స్టే చేయగా, సెప్టెంబర్ 2న రాత్రి మరో పబ్బుకు వెళ్లారని తెలుస్తోంది.
13 గదులు బుక్ చేసుకున్నారు
విద్యార్థుల కోసం హోటల్లో మొత్తం 13 గదులను బుక్ చేశారు. ఒక్కో గదిలో ఐదారుగురు విద్యార్థుల వరకు ఉన్నారు. అందులో ఉదయం పూట అకడమిక్ సెషన్స్ జరగగా, సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు జరిగాయి.
బుక్ చేసినప్పుడు ఆ వివరాలు పరిశీలించలేదు
సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థులకు లిక్కర్ సర్వ్ చేశారు. హోటల్ బుక్ చేసుకున్న సమయంలో విద్యార్థుల వయస్సుకు సంబంధించిన వివరాలను పట్టించుకోలేదని అంటున్నారు.
హోటల్ నుంచి పబ్బుకు వెళ్లి
ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన చాందినితో సహా దాదాపు 30 మంది విద్యార్థులు కలిసి జూబ్లీహిల్స్ రోడ్డులో ఉన్న ఓ పబ్కు వెళ్లారు. అక్కడ వారికి లిక్కర్ ఇవ్వగా, దానిని తీసుకున్నారు. చాలాసేపు అక్కడే పార్టీ చేసుకున్నారు.
ఆదేశాలు రాగానే పోలీసుల చర్యలు
గార్డియన్ లేకుండా, ఐడీ ప్రూఫ్ లేకుండా మైనర్ విద్యార్థులకు హోటల్లో గదులు అద్దెకు ఇవ్వడం సరికాదని హైదరాబాదు పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.