చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ వాహనాలు ఢీ..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కాన్వాయ్ వాహనాలు ఢీ కొన్నాయి. ఓ ఆవు కాన్వాయ్కి అడ్డం వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. కాన్వాయ్ లోని జామర్ వాహనాన్ని ఎన్ఎస్జీ-2 వాహనం ఢీ కొంది. ప్రమాదం తర్వాత వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో చంద్రబాబు 15 నిమిషాలపాటు రోడ్డుపైనే ఆగిపోయారు. తర్వాత స్పేర్ వాహనంలో సిబ్బంది రావడంతో బయల్దేరారు. ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద జరిగింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. స్వల్పగాయాలతో మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లింది. ప్రమాదంలో చంద్రబాబు సహా, ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి. అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు బయల్దేరింది.
Recommended Video
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ వాహనాలు ఢీ..#ChandrababuNaidu #Telangana #TDP pic.twitter.com/rRUqidw3px
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2020