వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఇలా చంద్రబాబు అలా: కిషన్‌రెడ్డి ఆగ్రహం, నిప్పులు చెరిగిన కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా సోమవారం మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు రాదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తాను కర్ణాటకలో బీజేపీని ఓడించామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Chandrababu and KCR propaganda against BJP, says Kishan Reddy

కాంగ్రెస్ నేతల ఆగ్రహం

విభజన హామీలపై మేము పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తిందని కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ అన్నారు. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రా పార్టీగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు టెండర్ల కట్టబెడుతోంది ఎవరని ప్రశ్నించారు. విభజన హామీల సాధనలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిలదీయడం లేదన్నారు.

వెంటనే పునర్విభజన చట్టం అమలు కోసం అసెంబ్లీ, కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారన్నారు. రిట్ పిటిషన్ పైన ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు వేయలేదన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందన్నారు.

తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వాపోయారు. తెరాస ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.

English summary
Bharatiya Janata Party leader Kishan Reddy on Monoday said that TRS and Telugudesam propaganda against BJP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X