వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుత్ర శోకం: నీటి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి...

|
Google Oneindia TeluguNews

11 నెలల చిన్నారి ప్రమాదవ శాత్తు నీటిగుంతలో పడి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీ నగర్‌లో జరిగింది. గాంధీనగర్‌కు చెందిన బోడా ప్రసాద్‌, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు తన్మయశ్రీ వయసు రెండేళ్లు కాగా.. కుమారుడు తన్వీష్‌ వయసు 11 నెలలు. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తారు.

ప్రసాద్‌ ఉదయాన్నే మిర్చి బస్తాలు తొక్కే పనికి వెళ్లగా.. అరుణ ఇంటిపనిలో నిమగ్నమైంది. తన్వీష్‌ ఆడుకుంటూ ఆడుకుంటూ తమ ఇంటి సమీపంలో గల తాతయ్య బోడా బాలు ఇంటివైపు వెళ్లి.. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న వృథానీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన గుంతలో పడి పోయాడు. అయితే అందులో నిల్వ ఉన్న నీటిలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత కుమారుడు కనిపించడం లేదని తల్లి అరుణ చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చి గుంతలో చూడగా బాలుడు కనిపించాడు.

 child fell down in Water, dead

బాలుడని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకుం టున్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. 2019 జనవరిలో ప్రసాద్‌ సోదరుడు రవి కుమార్తె గౌతమి.. గాంధీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇప్పటికీ ఆ సంఘటన నుంచి వారి కుటుంబం కోలుకోకముందే అదే కుటుంబంలో మరో విషాదం జరగిందని గ్రామస్తులు అంటున్నారు.

English summary
child fell down in Water and dead in bhadradri district gandhi nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X