ఇంటిపై చిన్నారి తెగిన తల: క్షుద్రపూజలు చేశారా?
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్లో గల చిలకానగర్లో ఓ ఇంటపై చిన్నారి తల లభించిన కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. ఆ ఇంటి యజమాని రాజశేఖర్ బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.
రాజశేఖర్ మామ హన్మంతు, బుచ్చమ్మ, లక్ష్మమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో క్షుద్రపూజలు చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ చిలకానగర్లోన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్కు చెందిన భవనంపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే.
చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిండు పౌర్ణమి రోజు క్షుద్రపూజలు చేయడానికి చిన్నారిని బలి ఇచ్చారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
సంఘటనా స్థలంలో ఉన్న సిసిటీవీ ఫుటేజీలను తెప్పించుకుని పోలీసులు పరిశీలస్తన్నారు. త్వరలోనే కేసను ఛేదించి నిందితులను గుర్తిస్తామని డిసిపి ఉమా మహేశ్వర శర్మ అంటున్నారు.