వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చినజీయర్ స్వామికి మాతృవియోగం: ఆశ్రమంలో అంత్యక్రియలు..
త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అలివేలు మంగ తాయారు (85) చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గత రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు.
Recommended Video
Antarvedi
Temple
Chariot
CBI
Probe
హిందూధర్మ
పరిరక్షణ
కోసం
పారదర్శకంగా
ప్రభుత్వం...!!
||
Onendaa
హైదరాబాద్ శివారులో గల శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ ఆశ్రమం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మంగతాయారు అంటే చినజీయర్ స్వామి ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఆమె పరమపదించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంగ తాయారు మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
Comments
English summary
Chinna Jeeyar Swamy mother alivelu mangatayaru passed away. she is unwell last some days
Story first published: Saturday, September 12, 2020, 12:24 [IST]