వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
‘సీఎంగా కేసీఆర్! తెలంగాణ ప్రజల అదృష్టం’
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు.
భద్రాచలం: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రజలకు సీఎంగా కేసీఆర్ దొరకడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం ఆయన . శ్రీ రామచంద్రస్వామి దర్శనం అనంతరం భద్రాద్రి అభివృద్ధి కోసం జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే దేవాలయాలకు స్వర్ణయుగం వస్తుందని అన్నారు.
కేసీఆర్ కోరిక మేరకు భద్రాచలం ఆలయంతో పాటు ప్రాంగణంలో ఆగమశాస్త్రం ప్రకారం మార్పులు సూచించామని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తన షష్ట్యబ్ది ఉత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా చినజీయర్ స్వామి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Comments
English summary
Chinna jeeyar swamy on Wednesday praised Telangana CM K Chandrasekhar Rao.
Story first published: Wednesday, February 1, 2017, 16:30 [IST]