స్వరూపానందకు హైకోర్టు షాక్: సాయిబాబాపై వ్యాఖ్యలు వద్దని ఆదేశం
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా షిర్డీ సాయిబాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ద్వారకా పీఠాధిపతి స్వరూపానందకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. సాయిబాబాపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
సాయిబాబాను కించపరిచే విధంగా స్వరూపానంద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని దిల్షుక్నగర్ షిర్డీ సాయిబాబా ట్రస్టు కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు ప్రజలు సాయిబాబా పేరుతో భూతాలను, ప్రేతాలను పూజిస్తున్నారని స్వరూపానంద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాయిబాబా అసలు దేవుడు కాడని ఆయన అన్నారు. చనిపోయిన మనిషిని దేవుడిగా పూజిస్తున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు.
షిర్డీ సంస్థాన్ను ఆయన శ్మశానంగా వ్యాఖ్యానించారు. శ్మశానంలో సమాధిని హిందువులు పూజించబోరని, అది హిందూ మత వ్యతిరేకమని ఆయన అన్నారు.