వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సివిల్స్ టాపర్ అనుదీప్‌‌తో కలిసి భోజనం చేసిన కెసిఆర్, అభినందన

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

అనుదీప్‌ యువతకు ఆదర్శంగా నిలుస్తాడన్న కెసిఆర్

హైదరాబాద్: సివిల్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రత్యేకంగా అభినందించారు. ప్రగతి భవన్‌లో కెసిఆర్ అనుదీప్‌ను ఆయన తల్లిదండ్రులను కలిశారు.

తెలంగాణకు చెందిన అనుదీప్ ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో కెసిఆర్ అనుదీప్‌తో పాటు ఆయన తల్లిదండ్రులను ప్రగతి భవన్‌కు పిలిపించుకొన్నారు.అనుదీప్‌ను కెసిఆర్ అభినందించారు.

CM KCR congratulates top ranker of Civil Services exams Anudeep

ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు అనుదీప్ ఆయన తల్లిదండ్రులు సోమవారం నాడు కెసిఆర్‌తో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన అనుదీప్‌ యువతకు ఆదర్శంగా నిలుస్తారని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

లక్ష్యసాధన కోసం కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించడం తథ్యమన్నారు.ఇటీవల వెలువడిన సివిల్‌ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.సివిల్స్‌ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్‌ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి.

English summary
Telangana chief minister K. Chandrasekhar rao congratulated MR. Durisetti Anudeep this years topper in all India civil services exams. Cm had lunch with Aundeep and his parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X