రెండు రోజుల్లో ఎరువుల సమస్య పరిష్కారం : సీఎం కేసీఆర్
గత రెండు రోజులుగా తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రగతి భవన్లో అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈనేపథ్యలోనే రాష్ట్రానికి సరిపోయో యూరియాను రెండు రోజుల్లో సరఫరా చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులు రాత్రీపగలు మానిటర్ చేయాలని ఆదేశించారు.యూరియా కొరత ఎర్పడడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఇందుకోసం నౌకశ్రాయాల నుండి అత్యవసరంగా తెప్పించేందుకు రైల్వే అధికారులతో ఆయన నేరుగా మాట్లాడారు. దీంతో ప్రత్యేకంగా ఎరువులు తెప్పించేందుకు శనివారం ఒక గూడ్స్ ట్రైన్ను ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారలు హామి ఇచ్చారు.ఎరువులను స్టాక్ పాయింట్స్ కు కాకుండ నేరుగా గ్రామాలకు తరలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోర్టుల్లో అధికారులు ఉండి యూరియా సరఫరాను పర్యేవేక్షించాలని చెప్పారు. మొత్తం నాలుగు రోజుల్లో ఎరువుల కొరత లేకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు గంగవరం పోర్టు నుండి ఎరువులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ సహాకారం అందించనుంది పోర్టు నుండి ఎరువులు తరలించేందుకు తాము కూడ సహకరిస్తామని ఏపీ మంత్రి పేర్నీ నానీ ప్రకటించారు.