వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి రవిశంకర్‌తో కేసీఆర్ భేటీ: హైకోర్టు విభజనతోపాటు కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త జోనల్ విధానం సహా పలు పెండింగ్ అంశాలపై ప్రధాని సహా, కేంద్రమంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు.

సుమారు 50నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. కేసీఆర్ వెంట వినోద్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా, నాలుగేళ్లు గడుస్తున్నా.. హైకోర్టు విభజన జరగకపోవడంపై కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది.

CM KCR Meets Union Minister Ravi Shankar Prasad Over High Court Bifurcation

హైకోర్టు విభజనకు సంబంధించి చొరవ తీసుకోవాలని మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కొత్తగా తీసుకొచ్చిన జోనల్ విధానంపైనా న్యాయశాఖ మంత్రితో చర్చించినట్లు సమాచారం. కాగా, కొత్తగా తీసుకొచ్చిన జోనల్ విధానంపై ప్రధాని మోడీతో శనివారం భేటీ కానున్నారు.

English summary
Telangana CM KCR Met Union Minister Ravi Shankar Prasad Over High Court Bifurcation on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X