రోగుల ఇక్కట్లు పట్టవా.. సమీక్ష కోసం 11 గంటలా.. సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మండిపాటు
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కేసీఆర్కు చీమకుట్టినట్లయినా లేదన్నారు. దీనిని బట్టి ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అన్నట్టు సీఎం వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు.
కరోనా వైరస్ నిర్మూలనపై పట్టించుకోని కేసీఆర్.. కొత్త సచివాలయ నిర్మాణంపై మాత్రం సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. శుక్రవారం 11 గంటలు సమీక్షించిన వార్తా కథనాన్ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదీ సీఎం కేసీఆర్ బాధ్యతారహిత్యం కాదా అని ప్రశ్నించారు. కొత్త సచివాలయంలో కార్యాలయాలు, పేషీలుు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చించేందుకు సమయం ఉంది కానీ.. రోగుల యోగ క్షేమాలు పట్టించుకునే తీరికలేదని మండిపడ్డారు.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే 64 వేల పాజిటివ్ కేసులు రావడంతో పరిస్థితి భయంకరంగా ఉందని.. రేవంత్ అన్నారు. కానీ సీఎం మాత్రం పట్టించుకోవడం లేదు అని.. తొలుత మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరే తప్ప.. మళ్లీ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదన్నారు.
కరోనా కల్లోలం పై ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘’ఎవడి పిచ్చి వాడికి ఆనందం’’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయం పై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. @TelanganaCMO pic.twitter.com/4xkH9o20RN
— Revanth Reddy (@revanth_anumula) August 1, 2020