వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ 45వేలకు కొనుగోలు...ఆపై సంతకం ఫోర్జరీ

|
Google Oneindia TeluguNews

ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్‌హెడ్‌ను దొంగిలించి ఆపై ఆయన సంతకం ఫోర్జరీ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎం లెటర్ హెడ్ పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసీ ప్రభుత్వ భూమినే కొట్టివేయాలని ప్లాన్ వేశారు. విషయం తెలియడంతో వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

cm kcr sign forgery on his letter head

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని లగ్జరీ ఏరియాల్లో ఒకటైన గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని చేయాలని స్థానిక ఆర్డీవోకు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా సీఎం లెటర్ హెడ్‌పై ఆయన సంతకాన్ని చూసిన రెవెన్యు అధికారులు షాక్‌కు గురయ్యారు. సంతకాన్ని పూర్తిగా పరీశీలించారు. దీంతో ఆ సంతకం ఫోర్జరీ అని తేలింది. దీంతో వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెవెన్యు అధికారులు . కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయాలు బయటపడ్డాయి.

సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తులు సీం లెటర్‌హెడ్ ను ఓ టీఆర్ఎస్ నేత వద్ద రూ 45వేలకు కొనుగోలు చేశారు. దీంతో సీఎం లెటర్ హెడ్ తమ చేతికి వచ్చిందని భావించిన యువకులు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ గచ్చిబౌలిలోని రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని ధరఖాస్తు చేసుకున్నారు. అనంతరం దానిపై రెవెన్యు అధికారులపై ఒత్తిడి కూడ తెచ్చారు. ఏదీ ఏమైన సీఎం లెటర్ హెడ్‌‌లు ఇంత బహిరంగంగా
లభిస్తున్నాయా అనేది తేలాల్సి ఉంది.

English summary
Telangana CM KCR letter head has stolen and signature was forgeryat Rajendranagar police station limits,police arrested them after the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X