Photos : సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. భారతావని దీప కాంతులు..
పేద,ధనిక తేడా లేదు.. పార్టీ జెండాలతో పనిలేదు.. కుల,మతాలకు తావు లేదు.. యావత్ భారతావని ప్రధాని మోదీ పిలుపుతో మరోసారి ఒక్క తాటి పైకి వచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతీ వీధిలో.. ప్రతీ పట్టణంలో.. ఇళ్ల ముందు,బాల్కనీల్లో దీప కాంతుల వెలుగులు పరుచుకున్నాయి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు ప్రతీ కుటుంబం తమ నివాసంలో లైట్లు ఆర్పి.. కొవ్వొత్తులు,దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించింది. కరోనాపై పోరులో సామాన్యులు మొదలు సెలబ్రిటీ వరకు మనమంతా ఒక్కటేనని ఈ దీపకాంతుల ద్వారా చాటిచెప్పారు.
Recommended Video
కరోనాపై యుద్దం.. వీధులన్నీ దీప కాంతులు..
ప్రధాని మోదీ పిలుపు మేరకు వీధుల్లో దీపాలు వెలిగిస్తున్న స్థానికులు..
కరోనాపై యుద్దం.. విధి నిర్వహణలో పోలీసులు సైతం..
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం దీపాలు వెలిగించి కరోనాపై పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.
దీప కాంతులు వెలిగిస్తున్న ఓ తల్లి..
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఓ తల్లి తమ ఇంట్లో దీప కాంతులు వెలిగిస్తున్న దృశ్యం
ఇంటి ముందు కొవ్వొత్తులతో
ఇంటి ముందు కొవ్వొత్తులతో సంఘీభావం తెలుపుతున్న ఓ కుటుంబం
దీప కాంతులు...
ఇంటి ముందు బాల్కనీలో దీపాలు వెలిగిస్తున్న దంపతులు..
దీప కాంతుల్లో మంత్రి..
దీపం వెలిగించి చిరునవ్వు చిందిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
కొవ్వొత్తులతో సీఎం జగన్
ఏపీలోని తాడేపల్లిలో ఉన్న తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ప్రగతి భవన్లో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రగతి భవన్లో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
కడియం కుటుంబం..
మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
తలైవా..
తన నివాసంలో కొవ్వొత్తి వెలిగించి పైకి చూపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్
రాజ్భవన్లో గవర్నర్
హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
ఫ్యామిలీతో సజ్జనార్
కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్..
దీపాలు వెలిగించిన అల్లు ఫ్యామిలీ
నిర్మాత అల్లు అరవింద్,తన కుమారుడు అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కొవ్వొత్తులు వెలిగించారు.
దీపం వెలిగించిన ప్రధాని తల్లి
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్లోని తన నివాసంలో దీపం వెలిగించిన దృశ్యం
మోదీ జ్యోతి ప్రజ్వలన
ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో జ్యోతి ప్రజ్వలన చేశారు..