'కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్యాయత్నం, దాడి'
హైదరాబాద్: అసెంబ్లీలో జరిగిన దాడిలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్కు కంటికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీ ఛానల్తో మాట్లాడారు. తనకు శత్రువులు ఎవరూ లేరన్నారు.
చదవండి: గవర్నర్కు డిసిప్లేన్ లేదా, ఢిల్లీలో మీరు వెళ్లట్లేదా: జీవన్, 'స్వామిగౌడ్ కార్నియా దెబ్బతింది'
అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై తుది నిర్ణయం స్పీకర్దేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాడు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పడు తనపై హత్యాయత్నం, దాడి జరిగిందన్నారు.
చట్టసభల్లో అందరూ హుందాగా వ్యవహరించాలన్నారు. దాడులు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేమని చెప్పారు. అసెంబ్లీలో స్వామిగౌడ్ పైన మైక్ దాడికి సంబంధించిన దృశ్యాలను విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు లేదా సభ్యులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.