వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ మునిగిపోయే పడవ .. 2సీట్లతోనే రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని ఆయన తెలిపారు. పార్టీ 16 సీట్లలో దేశ రాజకీయాల్లో ఏమి మార్పులు తీసుకు వస్తారని కాంగ్రెస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారో అర్థం కావడం లేదు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ దని గుర్తు చేశారు.

మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. ఏటూరునాగారం లోనూ వెంకటాపురం లోనూ జరిగిన సభల్లో పాల్గొన్న ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్‌తో చర్చలు?'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్‌తో చర్చలు?

Congress is a sinking boat..Minister Errabelle at election campaign

కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు 16 పార్లమెంటు స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలని గుర్తు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టారని చెప్పిన ఎర్రబెల్లి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఒరిగే ప్రయోజనమేమీ లేదని తెలియజేశారు. ఇక గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మొత్తానికి ఎన్నికల ప్రచార పర్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దూసుకుపోతున్నారు.

English summary
In the election campaign held in the district of Jayasankar Bhopalapalli district, Errabelli Dayakar Rao was furious at the Congress party. There is no benefit to the state with the Congress party. Errabelie described Congress as a sinking boat. The Lok Sabha election came to change the national politics . KCR is one and only the alternative to change the national politics Errbelli said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X