వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలకలం: భువనగిరిలో విజయశాంతి మేనేజర్ కిడ్నాప్..
భువనగిరి: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి మేనేజర్ సైదాచారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొంతకాలంగా ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారని, దాని కారణంగానే కిడ్నాప్ జరిగి ఉంటుందని చెబుతున్నారు. రూ.50లక్షలు ఇస్తేనే సైదాచారిని విడిచిపెడుతామని దుండగులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే గతంలో సైదాచారి ఓ మహిళ వద్ద అప్పు తీసుకున్నారని, ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతోనే ఈ కిడ్నాప్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. సైదాచారి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 8మంది దుండగులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
Comments
English summary
Congress leader Vijayashanti's manager was kidnpped by unknown persons in Yadadri Bhongir district. His family members lodged a complaint in Bhongir police stations
Story first published: Thursday, May 17, 2018, 20:52 [IST]