సెక్యూరిటీ గార్డ్ కూడా ఆంధ్రోళ్లే ఐతే ఎలా?: ఆంధ్రా యాసలో అడిగిన టి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం నాడు ఆంధ్రా యాసలో మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం నాడు ఆంధ్రా యాసలో మాట్లాడారు. తాను ఈ మధ్య ఒక కంపెనీకి వెళ్లానని, ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డు నుంచి ఉన్నతోద్యోగి వరకు అందరూ ఆంధ్రోళ్లే ఉన్నారని చెప్పారు.
ఇలా అయితే తెలంగాణ యువకులు ఏమై పోవాలన్నారు. మనకు భీమవరం రాజులు, గుంటూరు చౌదరీలు స్నేహితులుగా ఉండవచ్చునని, అలాగని అందరూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.
పువ్వాడకు మైక్, గందరగోళం: అధికారంలో కూర్చోం.. జానాపై కేటీఆర్ సీరియస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. విఅధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం సభలో టీఎస్ ఐపాస్పై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పైవిధంగా మాట్లాడారు.
ఆయన ఆంధ్రాయాసలో మాట్లాడి సమస్యను వెల్లడించారు. ప్రతి కంపెనీలో ఆంధ్రా వ్యక్తులే కనిపిస్తుంటే ఎలాగని, టీఎస్ఐ పాస్ ద్వారా యువతకు మేలు జరగకుంటే ఎలాగని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.