వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'' 2019లో గెలిచేవారికే టిక్కెట్లు, కెసిఆర్ అంటే నాకేం భయం''?

2019 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్టు కేటాయించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కంటే తాము దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తార

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: 2019 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్టు కేటాయించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కంటే తాము దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తారనే విషయం తనకు తెలియదన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విబేధాలు లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విపక్షంలో ఉన్న సమయంలో ఏ రకంగా పనిచేశామో, ఈ దఫా అంతకంటే ఎక్కువ దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు.

2014 ఎన్నికల నాటి పరిస్థితుల నాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తేడా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉన్నంత తేడా స్వేచ్చ ఉండదన్నారు.

రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలను తీసుకొంటున్నట్టు చెప్పారు.పార్టీ నాయకత్వం తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందన్నారు. తెలుగు న్యూస్ ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.

 గెలిచేవారికే టిక్కెట్లు

గెలిచేవారికే టిక్కెట్లు


2019 ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే గెలిచే అభ్య ర్థులను అనధికారికంగా ఎంపికచేసినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ బలమెంతో ఒక అంచనాకు వచ్చినట్టు చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉందన్నారు. అయితే ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయం సాధిస్తారో వారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు చెప్పారు.

కెసిఆర్ అంటే భయం లేదు

కెసిఆర్ అంటే భయం లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే తనకు భయం లేదన్నారు. సరిహద్దులో పనిచేసిన తనకు కెసిఆర్ అంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ విషయంలో చర్చకు సిద్దమేనని తాను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కూడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది


ఉత్తర తెలంగాణలో 2014 ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులు వన్ సైడ్ గా టిఆర్ఎస్ కు ఓటు చేశారని చెప్పారు. అయితే నాటి ఎన్నికలకు ప్రస్తుత పరిస్థితులకు పరిస్థితి తేడా ఉందన్నారు. టిఆర్ఎస్ పట్ల సింగరేణి కార్మికుల్లో కూడ వ్యతిరేకత వచ్చిందన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పరిస్థితిలో మార్పు రానుందనే ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో లేదో తెలియదు

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో లేదో తెలియదు


ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో లేదో తనకు తెలియదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు అందరినీ కలుపుకొని పోతున్నట్టు చెప్పారు. తనకు పార్టీలో ఎవరితో విబేధాలు లేవన్నారు. పార్టీ నాయకత్వం తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందన్నారు.కెసిఆర్ ప్రకటించిన సర్వే నివేదికలను రాజకీయాల్లో ఉన్నవారెవరూ కూడ విశ్వసించరని చెప్పారు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను కప్పిపుచ్చుకొనేందుకే కెసిఆర్ ఈ సర్వేలను తెరమీదికి తెస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

English summary
Iam never afraid to cm kcr said Tpcc chief Uttam kumar Reddy. he interviewed Telugu media channel on Sunday.congress party identified candidates for 2019 elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X