వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: రేవంత్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.. సోమవారం సికింద్రాబాద్‌ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు.

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌గౌస్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో అవలంభించాల్సిన వ్యూహంపై మాట్లాడుకొన్నారు.

Recommended Video

L Ramana Challenges Revanth Reddy : సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా | Oneindia Telugu
 congress party will get power in Telangana next elections, says Revanth reddy

తెలంగాణలో కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

నగరంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియర్లను, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిదులను రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు.

English summary
Revanth Reddy met Secundrabad former MP Anjankumar Yadav on Monday.Revanth Reddy said that congress party will get power in Telangana state next assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X