హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి, స్కూల్ బస్సు బీభత్సం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట పోలీసు క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Constable dies due to Gun Misfire at ameerpet police quarters

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో చోటుచేసుకున్న మిస్‌ఫైర్‌లో అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ ఖాజా మొయినుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లాలోని వలిగొండ.

ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. తుపాకీ పేలిన కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన పోలీసుక్వార్టర్స్‌లో విషాదాన్ని నింపింది.

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: ఐదుగురు చిన్నారులకు గాయాలు

హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో సోమవారం ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన లారీ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు సహా ఆటో, బైక్ లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు సహా పది మందికి గాయాలయ్యాయి.

గాయపడ్డ విద్యార్ధులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా లారీని నడిపిన డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.

English summary
Constable dies due to Gun Misfire at ameerpet police quarters at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X