నిరుద్యోగులకు కుచ్చు టోపీ: ఉద్యోగాల పేరుతో బడా మోసం.. ఫేక్ కన్సల్టెన్సీ!
హైదరాబాద్: కన్సల్టెన్సీల పేరుతో ఆఫీసులు తెరవడం.. అమాయకుల నుంచి డబ్బు గుంజి బోర్డు తిప్పేయడం వంటి ఘటనలో ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.
తాజగా హైదరాబాద్ లో మరో కంపెనీ కూడా ఇలాగే బోర్డు తిప్పేసింది. పోలీసుల కథనం ప్రకారం.. విక్రాంత్ వర్మ, రాహుల్ అగర్వాల్, సంజయ్ అనే ముగ్గురు మాసబ్ ట్యాంకులోని అశోకా ప్లాజాలో రెన్టెక్ కన్సల్టెన్సీ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ వీరు ప్రకటనలిచ్చారు.
సంస్థ ప్రకటనలకు ఆకర్షితులై చాలామందిని కన్సల్టెన్సీని ఆశ్రయించారు. ఉద్యోగం కోసం భారీగానే డబ్బు చెల్లించుకున్నారు. కానీ ఎన్ని రోజులైనా వీసా రాకపోవడంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులతో కలిసి కన్సల్టెన్సీ వద్దకు చేరుకునేసరికి ఆఫీసుకు తాళం వేసి ఉండటం గమనించారు. దీంతో బాధితులు సంస్థపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.