విల్లా పేరుతో 2.5 కోట్ల మోసం: టాలీవుడ్ స్టార్స్కూ కి'లేడీ' టోకరా
హైదరాబాద్: విశాఖలో విల్లాల పైన పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందవచ్చునని నమ్మించి, దాదాపు రూ.2.5 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో జరిగింది. విల్లాల పైన పెట్టుబడి పేరుతో బంజారాహిల్స్లో పలువురి నుంచి పెద్ద మొత్తంలో ఓ జంట డబ్బులు వసూలు చేసింది.
ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో టాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టి మోసగించిన ఆ జంట లలిత, ఆమె భర్త శ్రీవాత్సవ. బాధితుల నుంచి డబ్బులు, బంగారం, నగలు ఇలా అన్నింటిని తీసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
వివరాల మేరకు... లలిత, శ్రీవాత్సవ భార్యాభర్తలు. వారు సీతాఫల్మండిలో నివాసం ఉంటారు. వీరి బంజారాహిల్స్లో ఉండే పలువురు మహిళలతో పరిచయం పెంచుకొని, విశాఖలో విల్లాల పైన పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అలా పెడితే బాగా లాభం వస్తుందని చెప్పారు.
ఇలా, బాధితుల నుంచి దాదాపు రూ.2.5 కోట్ల మేర వసూలు చేశారు. పది మంది నుంచి ఆ మొత్తం వసూలు చేశారు. ఒక్కో బాధిత మహిళ రూ.2 లక్షల నగదు నుంచటి రూ.25 లక్షల నగదు వరకు ఇచ్చారు. అలాగే, తమ వద్ద ఉన్న బంగారం కూడా ఇచ్చారు.
ఆ తర్వాత వారికి తాము మోసపోయామని తెలిసింది. పోలీస్ కమిషనర్ను కలిశారు. వారు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.
ఇప్పటికే, వారి విచారణలో ఆ జంట మోసం చేసినట్లుగా గుర్తించారు. లగ్జరీ జీవితం గడిపేందుకు వారు చీటింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఆభరణాలను తాగట్టు పెట్టినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు పరీరాలో ఉన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీస్ టీం ఏర్పడింది.