పుష్కరాలకు వెళ్లేందుకు సండ్రకు గ్రీన్సిగ్నల్, నా కుమార్తెకు టికెట్ అడగలేదు: కడియం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై, బెయిల్ పొందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. గోదావరి పుష్కరాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సండ్ర పెట్టుకున్న పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసింది.
గోదావరి పుష్కరాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) బోర్డు సమావేశాలకు హాజరయ్యేందుకు సండ్రకు అనుమతి మంజూరు చేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. పుష్కరాలకు సండ్ర వెళ్లడంతో తమకెలాంటి అభ్యంతరం లేదని ఏసీబీ అధికారులు చెప్పడంతో కోర్టు ఈమేరకు తీర్పు వెల్లడించింది.
వరంగల్ ఎంపీ టికెట్ను నా కుమార్తెకు అడగలేదు: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
వరంగల్ పార్లమెంట్ స్ధానానికి జరిగే ఉప ఎన్నికల్లో తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. బుధవారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకుంటామని అన్నారు. తన కుమార్తె వైద్య వృత్తిలో స్ధిరపడిందని, వైద్య సేవలందిస్తూ ప్రజాసేవ చేయడమే ఆమె లక్ష్యమని వివరించారు. ఈ విషయంలో గతంలోనే తాను స్పష్టత ఇచ్చానని, అయినా సరే మళ్లీ తెరపైకి తన కూతరు పేరు తీసుకురావడం సరికాదన్నారు.