తెలంగాణలో కరోనా: 99శాతం రికవరీలు -కొత్తగా 146 కేసులు, రెండు మరణాలు
తెలంగాణ వ్యాప్తంగా కరోరా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. జాతీయ సగటు కంటే మెరుగైన రికవరీ రేటు కొనసాగుతోంది. కీలకంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై వారియర్లు విముఖత ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
భారత్లో కరోనా: 97% మించి రికవరీలు -కొత్తగా 12,194 కేసులు, 92 మరణాలు
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిడిచిన 24 గంటల్లో కొత్తగా 146 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 2,96,574కు, మరణాల సంఖ్య 1,616కు పెరిగాయి. అయితే..
నిన్న ఒక్కరోజే 177 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,93,210 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా రికవరీ రేటు 97.3శాతంకాగా, తెలంగాణలో మాత్రం అత్యంత మెరుగ్గా రికవరీ రేటు 98.86గా కొనసాగుతోందని రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది.
తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,748కి పడిపోపాయి. అందులో వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక కొత్తగా నమోదైనవాటిలో జీహెచ్ఎంసీలోనే 29 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వచ్చాయి. ఈ రెండూ తప్ప మిగతా అన్నిజిల్లాల్లో కొత్త కేసులు సింగిల్ డిజిట్ లేదా నిల్ కు పరిమితం అయ్యాయి. కాగా,
Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి
తెలంగాణలో తొలి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియగా.. టీకాల పట్ల కరోనా వారియర్లు విముఖత ప్రదర్శించినట్లు లెక్కల్లో వెల్లడైంది. చివరి రోజు వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్న వారిలో 24 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,77,825 మంది వ్యాక్సిన్ ఇవ్వగా.. రిజిస్టర్ చేసుకున్న వారిలో ఇది 33 శాతం మాత్రమే కావడం గమనార్హం.