గోవుల అక్రమ రవాణా..! లారీని ఛేస్ చేసి పట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)
హైదరాబాద్ : గోవుల అక్రమ రవాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 గోవులను రక్షించి ఠాణాకు తరలించారు. ఇదంతా ఎక్కడో జరిగిందనుకుంటున్నారా..! మన హైదరాబాద్ నగర శివార్లలోనే జరిగింది ఈ ఘటన. శంషావబాద్ హైవే నుండి ఓ కంటెయినర్లో 200 అవులను అక్రమంగా తరలిస్తున్నారన్న వార్త తెలుసుకున్న గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో హుటా హుటిన సంఘటనా స్థాలానికి బయల్తేరి వెళ్లారు. అక్కడి ఆగి వున్న కొన్ని లారీలను పరిశీలించారు.
ఓ పెద్ద కంటెయినర్ పైకి ఎక్కి చూడగా అందులో సుమారు 200 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే అదే కంటెయినర్ ను షేర్ లింగంపల్లి స్తేషన్ కి తరలించి కేసు నమోదు చేసారు. ఇదంతా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆద్వర్యైంలో జరగడం విశేషం. గోవులను ఎక్కడ లారీలో ఎక్కించారు, ఎక్కడకు తరలిస్తున్నారు, దాని వెనెక ఎవరు ఎన్నారనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. స్తేషన్ సిబ్బందికి కూడా దోషులు ఎవరో తేలేంత వరకు కంటెయినర్ డ్రైవర్ విడిచి పెట్టొద్దని రాజా సింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. 200 గోవులను సజీవంగా పట్టుకున్నందుకు రాజా సింగ్ అనుచరులు హర్హం వ్యక్తం చేసారు.