20 శాతం కమీషన్ తో నగదు మార్పిడి చేస్తోన్న ముఠా అరెస్టు
29 శాతం కమీషన్ ను తీసుకొని పాత నగదును తీసుకొని నోట్లను మారుస్తోన్న ముఠాను సూర్యాపేట పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. ఈ ముఠాలో గడ్డిపల్లి ఎంపి టి సి సభ్యుడు నాగేశ్వర్ రావు ఉన్నాడు.అయితే ఆయన తప్పిం
సూర్యాపేట :పెద్ద నగదు నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను సూర్యాపేట పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రజా ప్రతినిధులు కూడ ఉన్నారు. కుతుబ్ షాపురం సర్పంచ్ ను పోలీసులు అరెస్టు చేయగా, గడ్డిపల్లి ఎంపిటిసి సభ్యుడు పరారీలో ఉన్నాడు.
12 మంది ముఠా నోట్ల మార్పిడి కి పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కుతుబ్ షాపురం సర్పంచ్ శ్రీనివాస్ , గడ్డిపల్లి ఎంపిటిసి సభ్యుడు నాగేశ్వర్ రావు కూడ ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు.
ఈ ముఠా నుండి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకొన్నారు. కొత్త రెండువేల రూపాయాల నగదు సుమారు మూడున్నర లక్షలు, రద్దు చేసిన పాత ఐదు వందలు, వెయ్యి రూపాయాల నోట్లరూపాయాల నోట్లు సుమారు 86 వేలను స్వాధీనం చేసుకొన్నారు.
కమీషన్ పద్దతిలో పాత కరెన్సీని మార్చుతున్నారు. అయితే 20 శాతం కమీషన్ తో పాత నోట్లను మార్పిడి చేస్తోంది ఈ ముఠా.12 బ్యాంకు పుస్తకాలు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకొన్నారు. పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.