స్త్రీలకు పురుషులుగా, పురుషులకు స్త్రీల తరహలో వల వేసి...ఇలా...
పురుషులను స్త్రీల మాదిరిగా, స్త్రీలకు పురుషుల తరహలో డేటింగ్ సైట్ లో వల విసిరి డబ్బులు లాగుతున్న ఓ ముఠాను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ :అమ్మాయిల తరహలో అబ్బాయిలను, అబ్బాయిల తరహలో అమ్మాయిలకు డేటింగ్ సైట్ తో వల వేసే ముఠాను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
ఘరానా సైబర్ నేరగాళ్లకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు విచారణ చేసి పోలీసులు అరెస్టు చేశారు. హైద్రాబాద్ లోని టోలిచౌకికి చెందిన మొహిసిన్ ఆఘా ,నైజీరియాకు చెంది ప్రస్తుతం కోకాపేటలో ఉంటున్న మహ్మద్ హసానీ బరావు లతో పాటు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
డేటింగ్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. తప్పుడు ప్రోఫైల్స్ ను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడేవారు. పురుషులకు స్త్రీల మాదిరిగా,స్త్రీలకు పురుషుల మాదిరిగా చాటింగ్ చేసేవారు.
అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని డేటింగ్ వెబ్ సైట్ ద్వారా యువతిగా పరిచయం చేసుకొని చాటింగ్ చస్తూ వల విసిరారు.తాను అస్ట్రేలియాకు చెందిన అమ్మాయినేనని అంటూ డేటింగ్ వెబ్ సైట్ లో మొహిసిన్ ఆఘా నమ్మించాడు.
భారత ప్రభుత్వం నుండి తనకు 2.1 మిలియన్ డాలర్లు రావాల్సి ఉందని, వాటిని పొందాలంటే 210.00 డాలర్లు చెల్లించాలని నమ్మించాడు.
అయితే తనకు రావాల్సిన డబ్బు రాగానే అస్ట్రేలియాకు వస్తానని , అప్పుడు పెళ్ళిచేసుకోవచ్చని అతణ్ని నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన అస్ట్రేలియా వ్యక్తి 95 వేల డార్లు మొహిసిన్ ఆఘా ఖాతాలో జమ చేశారు.
అయితే అస్ట్రేలియాకు చెందిన వ్యక్తి హైద్రాబాద్ కు వచ్చి డేటింగ్ వెబ్ సైట్ లో తనకు పరిచయమైన యువతిని కలిసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆయనకు అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయాయని ఆయన అర్థం చేసుకొన్నాడు.
ఈ విషయమై ఆయన సిఐడి పోలీసులను ఆశ్రయించాడు.మొహసిన్, మహ్మద్ హసానీలను ఆయన అరెస్టు చేశారు. నిందితుడి ఖాతాలో 20 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.