Cyclone Tauktae:సూర్యాపేటలో ఘోరం -పిడుగుపాటుకు ఇద్దరు బలి -తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌక్తే' తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నాటికి ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు విస్తరించాయి. కొన్ని చోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి...
Recommended Video
తౌక్తే తుపాను కారణంగా సూర్యాపేట జిల్లాలోని నూతన్కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగంపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గ్రామంలోని పొలంలో మిరపకాయలు ఏరుతుండగా కూలీల సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరోవైపు..
ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తౌక్తే ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. 'తౌక్తే' తుపాను వాయుగుండంగా మారడంతో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే..
జగన్ బెయిల్ రద్దు వేళ రఘురామ అరెస్టు -విజయవాడకు రెబల్ ఎంపీ తరలింపు -వైసీపీ గప్చుప్ -బూమరాంగ్?
తుపాను కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో పలు రైలు స్వీసులు నిలిచిపోయాయి. గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఆదివారం నడవాల్సిన పూరి-ఓఖా ఎక్స్ప్రెస్, 17న నడిచే రాజ్కోట్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-రాజ్కోట్ ఎక్స్ప్రెస్లు, 18న నడిచే పోరుబందర్-సికింద్రాబాద్, 19న బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-పోరుబందర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న నడవాల్సిన ఓఖా-రామేశ్వరం రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించారు.