నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు షాక్: ఆలోగా బిజెపిలోకి డి శ్రీనివాస్ తనయుడు అరవింద్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిజామాబాద్ జిల్లాలో గట్టి షాక్ తగలనుందా? సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడే మరో పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిజామాబాద్ జిల్లాలో గట్టి షాక్ తగలనుందా? సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడే మరో పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.

చదవండి: సంచలనం: 'టిఆర్ఎస్‌లో అసంతృప్తి, కాంగ్రెస్‌లోకి హరీష్ రావు'

బిజెపిలో చేరనున్న డిఎస్ తనయుడు

బిజెపిలో చేరనున్న డిఎస్ తనయుడు

టిఆర్ఎస్ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌ తనయుడు అరవింద్‌ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.

అమిత్ షా సమక్షంలో చేరిక

అమిత్ షా సమక్షంలో చేరిక

ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసి, ఆయన సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నవయుగ సంస్థ రియల్‌ డైరెక్టరుగా ఉన్నారు. గతంలో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు రంజీ ఆటగాడిగా కొనసాగారు. కాలికి గాయం కావడంతో ఆ తర్వాత దూరమయ్యారు.

మోడీ అంటే అభిమానం

మోడీ అంటే అభిమానం

ఆయన ఆరేళ్ల క్రితమే బిజెపిలో చేరాలనుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎందుకో చేరలేకపోయారని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే అరవింద్‌కు ఎంతో అభిమానం అని తెలుస్తోంది.

ఆలోగా బిజెపిలోకి

ఆలోగా బిజెపిలోకి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 17న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ నిజామాబాద్ రానున్నారు. ఆలోగానే కమలం తీర్థం పుచ్చుకోవాలని అరవింద్ భావిస్తున్నారు.

English summary
It is said that TRS Rajya Sabha member Arvind may join Bharatiya Janata party soon. D Srinivas is now in Telangana Rastra Samithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X