హోరెత్తించిన దాండియా: నాయిని ఆడారు(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, త్వరలోనే ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన దాండియా నైట్ 2014 కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన కాసేపు దాండియా ఆడి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దసరాను గుజరాతీలు, మార్వాడీలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారన్నారు. హైదరాబాద్లో మత సామరస్యం వెల్లి విరుస్తుంటుందని, నగర బ్రాండ్ ఇమేజ్ను ఇది పెంచుతుందని తెలిపారు.
ప్రజల భద్రత కోసం నగరంలో మూడు వేల కెమెరాలను అమర్చబోతున్నామని చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ కీర్తిని దశదిశలా వ్యాప్తి చేయడానికి సిఎం కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని చెప్పారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియే షన్ పూర్వ అధ్యక్షుడు డి.రామ్రెడ్డి, గాయకుడు సందీప్ బాత్రా పాల్గొన్నారు.
దాండియా
నగరంలోని పీపుల్స్ ప్లాజాలో దాండియా ఆడుతూ సందడి చేస్తున్న యువతులు.
దాండియా
దాండియా నైట్ పేరిట జరిగిన కార్యక్రమంలో సాంప్రదాయ వస్త్రాధరణలో దాండియా ఆడుతున్న యువతులు.
నాయిని
హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, త్వరలోనే ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.
దాండియా ఆటలు ఆడా..
దసరాను గుజరాతీలు, మార్వాడీలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారని నాయిని అన్నారు.
ప్రారంభిస్తూ..
పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన దాండియా నైట్ 2014 కార్యక్రమాన్ని నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.
నాయిని దాండియా
అనంతరం నాయిని నర్సింహారెడ్డి అక్కడున్న యువతులతో కాసేపు దాండియా ఆడి ఆకట్టుకున్నారు.
నాయిని దాండియా
హైదరాబాద్లో మత సామరస్యం వెల్లి విరుస్తుంటుందని, నగర బ్రాండ్ ఇమేజ్ను ఇది పెంచుతుందని తెలిపారు.
దాండియా
బుధవారం రాత్రి ఈ జరిగిన ఈ కార్యక్రమంలో దాండియా ఆటలుఆడిన యువతులు, మహిళలు హోరెత్తించారు. యువతులతో యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
దాండియా
బ్రాండ్ హైదరాబాద్ కీర్తిని దశదిశలా వ్యాప్తి చేయడానికి సిఎం కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని మంత్రి నాయిని చెప్పారు.