హయత్నగర్ టు ఆమన్గల్ .. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!
హైదరాబాద్ : హయత్ నగర్ కన్నతల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కన్న కూతురు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చడం హాట్ టాపికైంది. మైనర్ వయసులో కీర్తి రెడ్డి తెలిసి తెలియక చేసిన తప్పు ఇప్పుడు మూడు కుటుంబాల పరువు రోడ్డెక్కించింది. 17 ఏళ్ల వయసులో ప్రేమ దోమ అంటూ ఆకర్షణకు లోనై ఓ యువకుడి వలలో చిక్కుకున్న కీర్తి రెడ్డి తన జీవితం అంధకారం చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికైంది. లవ్ పేరుతో ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి హద్దులు దాటించిన ప్రియుడు గర్భవతిని చేశాడు.
అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని కీర్తి రెడ్డి మరో తప్పు చేసింది. అదే అతడికి అస్త్రంగా మారి చివరకు కీర్తి రెడ్డిని ఉసిగొల్పి తల్లి హత్యకు ప్రేరేపించినట్లైంది. అయితే ఈ కేసు ఇప్పుడు ఆమంగల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తి రెడ్డికి అక్కడ గర్భస్రావం ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగ లాగుతున్నారు పోలీసులు.
హయత్నగర్ తల్లి హత్య కేసులో ట్విస్టులెన్నో
నల్గొండ టు ఆమంగల్ వయా హయత్నగర్ తీరుగా సాగిన కీర్తి రెడ్డి తల్లి హత్య కేసులో రోజుకో నిజం వెలుగుచూస్తోంది. హయత్నగర్లో ఈ నెల 19వ తేదీన పక్కింటి కుర్రాడు శశి కుమార్తో కలిసి తల్లిని సొంత కూతురే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హాట్ టాపికైంది. తొలుత కేసును పక్కదారి పట్టించాలని చూసిన కీర్తి రెడ్డి, శశి కుమార్ ఆటలు సాగలేదు. చివరకు వారిద్దరే ముద్దాయిలుగా తేలారు. వీరితో పాటు కీర్తి రెడ్డి మొదటి ప్రియుడు బాల్రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా వేర్వేరుగా ముగ్గురిని ప్రశ్నించడంతో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడ్డాయి. చివరకు ఈ కేసు 10 లక్షల రూపాయల చుట్టూ తిరగడం కొసమెరుపు. అదలావుంటే ప్రస్తుతం పోలీసుల దృష్టి కీర్తి రెడ్డికి అబార్షన్ చేయించిన ఆమంగల్ వైపు మళ్లింది.
పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్
అబార్షన్ కోసం ఆమంగల్ ఎందుకు వెళ్లినట్లు..!
గర్భస్రావం చేయించుకోవడానికి హైదరాబాద్ నుంచి ఆమంగల్ ఎందుకు వెళ్లారు? బాల్రెడ్డి కారణంగా గర్భం దాల్చిన కీర్తి రెడ్డి పక్కింటి కుర్రాడైన శశి కుమార్ సాయం ఎందుకు తీసుకుంది? ఇప్పుడు తల్లిని చంపిన దారుణం కంటే అప్పుడే గర్భం దాల్చిన విషయం ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులే ఏదో ఒకటి చేసేవారు కదా..! ఇలాంటి అనుమానాలెన్నో. అయితే పక్కింట్లో ఉంటాడు గదా అనే చనువుతో శశి కుమార్ సాయం తీసుకుంటే చివరకు అబార్షన్ అస్త్రంతో కీర్తి రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. తరచుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. అంతేకాదు చివరకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆమె తల్లిని హత్య చేసేంత వరకు కథ నడిపించాడు.
ఎల్బీ నగర్లోని వైద్యుడి సూచన మేరకే అక్కడకు వెళ్లారా?
హైదరాబాద్లో గర్భస్రావం చేయించుకోవడం కుదరదని భావించడం ఒక కారణమైతే.. ఎల్బీ నగర్లోని ఓ వైద్యుడి సూచనతోనే వీరు ఆమంగల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అతడి సలహా మేరకు ఈ ఏడాది జనవరిలో అక్కడకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది కీర్తి రెడ్డి. ఆ సమయంలో బాల్రెడ్డి, శశి కుమార్ ఇద్దరు కూడా తోడుగా ఉన్నారు. అక్కడే రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఏమీ తెలియనట్లు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే ఈ కేసులో ఆమంగల్ పేరు మార్మోగింది. అక్కడ జోరుగా అబార్షన్లు జరుగుతున్నాయనే టాపిక్ చర్చానీయాంశంగా మారింది.
ఆమంగల్ వైపు మళ్లిన పోలీసుల దృష్టి
ఆమంగల్లో కీర్తి రెడ్డికి అబార్షన్ జరిగిందని మీడియాలో వివిధ కథనాలు వస్తుండటంతో పోలీసుల దృష్టి అటువైపు మళ్లింది. అక్కడ అనుమతులు లేని ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా గర్భస్రావాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గర్భస్రావాలకు ఆమంగల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందనే వాదనలు లేకపోలేదు. వైద్యశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతోనే కొందరు ఆర్ఎంపీలు చెలరేగి పోతున్నారనే టాక్ నడుస్తోంది. కీర్తి రెడ్డి అబార్షన్ విషయం బయటకు పొక్కడంతో ఆమంగల్లో లెక్కకు మించి అబార్షన్లు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
ఆమంగల్ కేంద్రంగా అబార్షన్లు జోరుగా సాగుతున్నాయా?
కీర్తి రెడ్డి ఘటన తర్వాత ఆమంగల్ కేంద్రంగా అబార్షన్లు జోరుగా సాగుతున్నాయనే విషయం బయట పడింది. ఇక్కడ పదుల సంఖ్యలో ఆర్ఎంపీలు అదే పనిగా అబార్షన్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో గర్భస్రావం చేయించుకోవడానికి ఇక్కడకు వస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో అందిన కాడికి దండుకుంటున్న కొందరు ఆర్ఎంపీలు అవసరమున్నా లేకున్నా టెస్టుల పేరిట ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు. అయితే కీర్తి రెడ్డికి అబార్షన్ ఎవరు చేశారనేది ఆమంగల్లో హాట్ టాపికైంది. ఆమంగల్లో అబార్షన్ చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించిన కీర్తి రెడ్డి ఆ డాక్టర్ పేరు కూడా చెప్పి ఉంటుందని భావిస్తున్నారు. దాంతో స్థానికంగా ఆ డాక్టర్ ఎవరనేది చర్చానీయాంశమైంది.
పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!
శారీరకంగా వాడుకుని.. కీర్తి రెడ్డిన పావుగా చేసి..!
అదలావుంటే గురువారం నాడు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. కీర్తి రెడ్డికి సాయం చేస్తున్నట్లు నటించిన పక్కింటి కుర్రాడు శశి కుమార్ ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకోవడమే గాకుండా 10 లక్షల రూపాయల కోసం వేధించినట్లు సీపీ చెప్పారు. అయితే అంత పెద్ద మొత్తం తన దగ్గర లేదని కీర్తి రెడ్డి చెప్పడంతో తల్లిని చంపితే ఆ మొత్తం ఇవ్వొచ్చని ఆమెను హత్యకు ప్రేరేపించినట్లు దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు.