మంత్రి నారాయణ కొడుకు మృతిపై డీసీపీ: రెప్పపాటు వేగంలో పిల్లర్ను ఢీకొట్టి...
కారు అతి వేగంగా పిల్లర్ను ఢీకొట్టడం వల్లనే ఏపీ మంత్రి పీ నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారని పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం తెలిపారు.
హైదరాబాద్: కారు అతి వేగంగా పిల్లర్ను ఢీకొట్టడం వల్లనే ఏపీ మంత్రి పీ నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారని పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం తెలిపారు.
నారాయణ కొడుకు మృతిపై ఫోరెన్సిక్ వైద్యులు ఇలా..
అదుపుతప్పి
కారు నారాయణగూడ నుంచి పెద్దమ్మ గుడి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టిందని డీసీపీ తెలిపారు. తెల్లవారుజామున 2.45-2.50 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగిందన్నారు.
కారు వేగంగా ఢీకొట్టి వెనక్కి వచ్చింది
కారు వేగంగా పిల్లర్ను ఢీకొట్టి తిరిగి కొంత వెనక్కి వచ్చిందన్నారు. ప్రమాదం కారణంగా భారీ శబ్దం రావడంతో ఆ పరిసర ప్రాంతంలో నైట్ రౌండ్స్లో ఉన్న తమ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కారులో చిక్కుకున్న ఇద్దరు యువకులను అతి కష్టమ్మీద బయటకు తీశారని డీసీపీ తెలిపారు.
బెలూన్లు ఓపెన్ అయినా..
బెలూన్లు సకాలంలో ఓపెన్ అయినా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని డీసీపీ వెల్లడించారు. మంత్రి నారాయణ కొడుకు బుధవారం వేకువజామున మృతి చెందిన విషయం తెలిసిందే.
రెప్పపాటు వేగంలో పిల్లర్ను ఢీకొంది
కాగా, నిషిత్, అతని స్నేహితుడు రవిచంద్ర ప్రయాణిస్తున్న బెంజ్ కారు మెట్రో పిల్లర్ నెంబర్ 9ను బలంగా ఢీకొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పోలీసులు విడుదల చేశారు. ఇందులో కారు రెప్పపాటు వేగంలో ఫిల్లర్ను ఢీకొన్న దృశ్యాలు ఉన్నాయి.