గోనెసంచీలో యువతి మృతదేహం: కాళ్లూ చేతులూ కట్టేశారు
హైదరాబాద్: హైదరాబాదులోని లింగపల్లి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొంత మంది దుండుగులు గొనెసంచీని రైలులో వదిలేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు.
చివరకు గోనెసంచీలో మృతదేహం ఉన్నట్లు ప్రయాణికులు గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులను చూసిన దుండగులు వారికి దొరకకుండా పారిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆ మృతేదహాన్ని 20 ఏళ్ల వయస్సు గల యువతిదిగా గుర్తించారు. యువతి కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయి. యువతిని చంపేసి గోనెసంచీలో వేసి రైల్లో వేయాలని దుండగులు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. తద్వారా రైలులో శవం ఇక్కడి నుంచి తరలిపోతుందని భావించినట్లు తెలుస్తోంది.
ఇటుక బట్టీ కూలీల గుమస్తా దెబ్బలకు పనికి వచ్చిన ఓ గర్భిణీ స్థ్రీ అసువులు బాసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన కొందరు కూలీలు హన్మంతుని పేట గ్రామ సమీపంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం అలసిపోయి కూర్చున్న గర్భిణి సుర్ణజారు (25)పై ముఠా మేస్త్రీ ఉద్ధవ్ విచక్షణారహితంగా కొట్టాడు. పొట్టపై బలంగా తన్నడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆమె మరణించింది. ఆ మేస్త్రీది కూడా ఒడిషా రాష్ట్రమే.