షాక్: థమ్సప్ బాటిల్లో చచ్చిన బల్లులు!
థమ్సప్ బాటిల్లో చనిపోయిన బల్లులు కనిపించిన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో బుధవారం జరిగింది.
వనపర్తి: చల్లని పానీయాలను ఇష్టంగా సేవించే వారికి ఈ వార్త షాక్కు గురిచేస్తుంది.వినియోగదారుల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ధనార్జనే లక్ష్యంగా కొన్ని ఉత్పత్తి సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఇందుకు నిదర్శనమే తాజాగా, థమ్సప్ బాటిల్లో చనిపోయిన బల్లులు కనిపించడం. ఈ ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. శ్రీరంగాపూర్లోని వెంకటయ్య దుకాణానికి అక్టోబర్ 27, 2016న తయారైన తేదీతో థమ్సప్ కూల్డ్రింక్స్ సరఫరా అయ్యాయి.
బుధవారం గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి థమ్సప్ కొనేందు కు రాగా, షాపు యాజమాని మల్లయ్య బాటిల్ ఇవ్వబోతుండగా బల్లులు ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే విషయాన్ని పెబ్బేరులోని కూల్డ్రింక్స్ డీలర్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ విషయంపై కంపెనీ యాజమాన్యానికి డీలర్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. పలు చల్లనీ పానీయాల్లో పురుగులు, చిన్న వానపాములు కూడా గతంలో ఆ బాటిళ్లలో రావడం గమనార్హం.