డిగ్రీలో హైటెక్ కాపియింగ్... వాచీలో ఫోటో కాపీతో దొరికిన విద్యార్ధి..
కాపియింగ్ అనేది పబ్లిక్ పరీక్షల్లోనో లేదా, ఎదైన ఉద్యోగాల ఎట్రన్స్ల్లోనో చూస్తాం ,హైటెక్ కాపీయింగ్ అనేది చాల సంధర్భాల్లో రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులను ముప్పు తిప్పాలు పెట్టాయి. దీంతో ఎన్నోసార్లు పరీక్షలు రద్దయిన పరిస్థితి నెలకోంది. ఇలాంటీ హైటెక్ కాపీయింగ్లు ప్రభుత్వ, ప్రైవేట్ పరీక్షల్లో,అనేక పరికరాలు ఉపయోగించిన దాఖాలాలు ఉన్నాయి.అయితే ఆధునిక పరికరాలు ఉపయోగించి సాధారణ డిగ్రి పరీక్షల్లో కూడ మాస్ కాపియింగ్లు కొనసాగుతున్నాయి. అదికూడ హైటెక్ పద్దతిలో కొనసాగించాడు ఓ విద్యార్ధి.
తెలంగాణ రాష్ట్ర్రంలోని నారయణపేట జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫస్ట్ఇయర్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఆ పరీక్షలు పట్టణంలోని ఓ ప్ర్రైవేట్ కాలేజీలో జరుగుతున్నాయి. అయితే డిగ్రీ ఫస్టియర్లో కూడ ఓ విద్యార్థీ కాపీయింగ్కు పాల్పడ్డాడు. అదికూడ హైటెక్ పద్దతిలో,పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ మంగళవారం జరిగాయి. దీంతో ఆ విద్యార్థి జవాబులను ఫోటో కాపీతీసీ తన వాచీలో కాపీ చేసుకున్నాడు. దీంతో ఎంచక్కా చూసీ రాశాడు. అయితే ఇది గమనించిన ఎగ్జామీనర్ విద్యార్థిని పరీశీలించడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో వాచీని స్వాధీనం చేసుకుని , విద్యార్థిని పరీక్ష నుండి డిబార్ చేశారు.
దీన్నిబట్టి ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదా అనేది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందనదీ అర్ధమవుతుంది. ప్రస్థుత విద్యా వ్వవస్థలో చాల మంది విద్యార్ధులు తమ ప్రతిభను చదువుల్లో కనబరుస్తుంటే ,గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యా ఇంకా అంతంత మాత్రమే ఉందని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికై విద్యార్థులు ఉన్నత చదువుల్లో ఇలాంటీవి పాల్పడకుండా విద్యా వ్వవస్థను తీర్చీదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలతోపాటు ఆయ సంస్థల ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంది.