వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Padma Rao To Be New Deputy Speaker Of Telangana | Oneindia Telugu

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. దీనికి సంబంధించిన గుట్టును సభలో విప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

ఎలా ఏకగ్రీవం అంటే ..?

ఎలా ఏకగ్రీవం అంటే ..?

సాధారణంగా ఒక అభ్యర్థి బరిలో ఉంటే ఎవరి ఎన్నికైనా ఏకగ్రీవమే ఇందులో ఎలాంటి సందేహం లేదు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఎన్నికపై చర్చ సందర్భంగా దీనికి సంబంధించిన లోగుట్టు చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో తాను డిప్యూటీ స్పీకర్ గా పనిచేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేకున్నా విపక్ష టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని గుర్తుచేశారు. ఆ పరోపకారానికి కొనసాగింపుగా ఏకగ్రీవానికి కాంగ్రెస్ సహకరించిందని చెప్పకనే చెప్పారు. దీనినిబట్టి అప్పుడు టీఆర్ఎస్ సహకరించినందునా .. ఈసారి తాము కో ఆపరేట్ చేశామని సెలవిచ్చారు.

రంగంలోకి వర్కింగ్ ప్రెసిడెంట్

రంగంలోకి వర్కింగ్ ప్రెసిడెంట్

డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ వచ్చి .. టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ అభ్యర్థితం ఖరారు కాగానే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. శనివారం స్వయంగా సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరారు. వారి మధ్య ఎమ్మెల్సీ సీటుపై చర్చ వచ్చిన అది తన పరిధిలోని అంశం కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గతంలో తాము సహకరించిన విషయాన్ని గుర్తుచేయడంతో కాంగ్రెస్ నేతలు అంగీకరించి .. పోటీకి అభ్యర్థిని నిలుపలేదు.

సభాను హుందాగా నడపండి

సభాను హుందాగా నడపండి

తాను గతంలో ఉప సభాపతిగా పనిచేసిన సమయంలో హుందాగా పనిచేశానని చర్చ సందర్భంగా చెప్పారు భట్టి విక్రమార్క. అధికార, విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా చూశానని, మీరు కూడా అలాగే వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైందని ప్రత్యేకంగా ప్రస్తావించారు భట్టి విక్రమార్క.

English summary
telangana assembly deputy speaker padma rao goud unanimous elected. are knows .. but reveal the reason is says clp leader bhatti vikra marka. in common state works deputy speaker, that time opposition trs co-operate us. right now we co-operate to trs .. this issue ask trs working president ktr. we are agree bhatti told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X