టైమ్, డేట్ చెప్పండి: కేసీఆర్ సర్కారుకు తేల్చి చెప్పిన దిగ్విజయ్
తనపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్పై ఎమ్మెల్యే మాగంటి గోపీన
హైదరాబాద్: తనపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ పోలీస్పై వివాదాస్పద వ్యాఖ్యలు: దిగ్విజయ్ సింగ్పై కేసు నమోదు
ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. తాను తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నారు. తాను తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఏమీ చేయలేదన్నారు.
అంతేగాక, తాను తెలంగాణ పోలీసులు ప్రతిష్టను తాను పెంచానని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏ రోజు, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సర్కారుకు స్పష్టం చేశారు.
Telangana Police has set up a bogus ISIS site which is radicalising Muslim Youths and encouraging them to become ISIS Modules.
— digvijaya singh (@digvijaya_28) May 1, 2017
ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువతను ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరేందుకు తెలంగాణ పోలీసులు ప్రోత్సహిస్తున్నారంటూ ఇటీవల దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.