వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన విందు, హోటల్‌కు ఇవాంకా, రాజ్‌కోట్‌కు ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు ముగిసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు ముగిసింది. అలాగే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన కూడా ముగిసింది.

చదవండి: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న మోడీ, ఇవాంకా, కేసీఆర్.. ఇవాంకాకు రాయల్ ట్రీట్‌మెంట్, మొదలైన విందు

భాగ్యనగరంలో మంగళవారం మొదలైన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్)లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. విందు సందర్భంగా ఇవాంకా ట్రంప్‌కు ప్యాలెస్ వద్ద రాయల్ ట్రీట్‌మెంట్ ఇచ్చి స్వాగతం పలికారు.

modi-ivanka

అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ఇవాంకాతోపాటు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.

ఈ విందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తెలుగురాష్ట్రాల నుంచి ప్రతాప్‌ సి.రెడ్డి, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, బ్రాహ్మణి, ఉపాసన, సంజయ్‌బారు, శోభనా కామినేని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విందులో దేశ, విదేశీ వంటకాలతోపాటు స్థానికంగా పేరుగాంచిన ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించారు. ప్యాలెస్‌లో నిజాం నవాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 101 మంది ఒకేసారి భుజించగలిగే డైనింగ్ టేబుల్ పై ఇవాంకా సహా అతిథులంతా విందు ఆరగించారు.

విందు అనంతరం ఇవాంకా తిరిగి తాను బస చేస్తోన్న ట్రైడెంట్ హోటల్ కు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మెట్రో రైలు ప్రారంభం, జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన కూడా ముగిసింది.

దీంతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు అయిపోగానే ప్రధాని మోడీ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నించి ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు బయలుదేరారు. మోడీకి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు వీడ్కోలు పలికారు.

English summary
Prime Minister Narendra Modi and US President Donald Trump's daughter and presidential adviser, Ivanka Trump attended a gala dinner at the Falaknuma Palace in Hyderabad on Tuesday evening. After dinner, Ivanka returned to Trident Hotel and PM Modi went to Samshabad Airport to go to Rajkot. CM KCR, Governor Narasimhan, Ministers of Telangana State given send-off to Modi. At falaknuma palace dinner is hosted by the Union government as part of the ongoing Global Entrepreneurship Summit (GES) 2017, the dinner was arranged for around 1,500 delegates of the GES on the lawns of the palace. The Royal Dinner had the prominent delegates dine at the Nizam-era table which can seat 101 guests at a time. Telangana Chief Minister K Chandrashekhar Rao was among those present for the dinner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X