కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయండి ,
సికింద్రాబాద్ పార్లమెంట్ ,బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిపై హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలైంది. కిషన్ రెడ్డి ఎన్నికల నిబంధలనను ఉల్లంఘించారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేసి అనర్హుడిగా ప్రకటించాలంటూ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ ఏజంట్ గుర్రం పవన్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు, శుక్రవారం విచారించనుంది.
రెండు రోజుల క్రితం నారయణ గూడ వద్ద పోలీసుల తనీఖీల్లో 8 కోట్ల రుపాయాలు పట్టుబడిన విషయం తెలిసిందే,అయితే తమ డబ్బులే అని ,పార్టీ కార్యాలయ ఖర్చుల నిమిత్తం వాటిని తీసుకువస్తున్నామని తర్వాత బీజేపీ ప్రకటించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయడానికి వీలు కాదు ,అయినా బీజేపీ ఎనిమిది కోట్ల రుపాయలను ఇండియన్ బ్యాంకు నుండి విత్ డ్రా చేసిందని పిటిషనర్ పేర్కోన్నారు.కాగా అది చట్టవిరుద్దమని, ఆడబ్బులను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎన్నికల్లో పంపీణి చేయడానికే బీజేపి ప్రయత్నాలు చేసిందని పేర్కోన్నారు.
అయితే ఇదే అంశాలతో ఈసికి పిర్యాధు చేసిన పట్టించుకోలేదని ,ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు . ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఆయన్ను ఎన్నికల్లో పోటి చేయకుండా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు.దీంతో పిటిషన్ ను స్వికరించిన హైకోర్టు కేసు విచారణను రానున్న శుక్రవారం విచారించనుంది.