శునకమే కానీ....నిత్యం ఆలయంలో దేవున్ని కొలుస్తుంది.
మూగజీవమైన ఈ శునకం మనిషిపట్ల విశ్వాసం మాత్రమె చూపించటం లేదు. దేవుడి పట్ల ఎనలేని భక్తి తో నిత్య పూజలు చేస్తుంది.
కరీంనగర్: మనిషి తన స్వార్థం కోసం దేవుళ్లను వేడుకుంటాడు, నాకు ఆస్తులు ఇవ్వాలని,కోట్లు గడించాలని, అంతస్తులు పెరగాలని,ఆరోగ్యంగా ఉంచాలని,కోరిన ప్రతి కోరిక తన ఉనికిని తన బ్రతుకును కాపాడుకోవటం కోసమె,కానీ మూగజీవమైన ఈ శునకం మనిషిపట్ల విశ్వాసం మాత్రమె చూపించటం లేదు. దేవుడి పట్ల ఎనలేని భక్తి తో నిత్య పూజలు చేస్తుంది.
అసలు ఆ శునకం ఏంటి ఆ విశ్వాసం ఏంటో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా వెళ్లాల్సిందె
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన గంగారాం నర్హ్సింహా అలయ పూజారిగా చేస్తాడు,అయితె గత కొంతకాలం క్రితం ఆ ఆలయం పరిశరాల్లో ఓ అప్పుడె పుట్టిన కుక్కపిల్ల కనిపించింది,అయ్యెపాపం ఈ బిడ్డను వదిలి తల్లీ ఎక్కడికి వెళ్లిందొ అని అన్నిచోట్ల వెతికాడు కానీ ఎక్కడ కనిపించలేదు,
దాంతో ఆ శునకాన్నీ తనవద్దె ఉంచుకొని పెంచాసాగాడు,అయితె తాను చిన్నవయసులో ఉన్నప్పుడు తనని చేరదీసిన ఆ యజమాని ఆ ఆలయం లో పూజలకు తోడుగా ఉండేది, అలాగె పూజారి తినె సాత్విక ఆహారం తినేది,దాంతోపాటు ప్రతి నిత్యం వచ్చిపోయె భక్తులను చూసి తాను కూడా భక్తిశ్రద్ధలతో లక్ష్మినరసింహ స్వామీని మొక్కడం ఆరంభించింది..తన యజమాని కి ఇప్పటికి విశ్వాసంతో ఉన్న ఈ శునకం తన యజమానికి తోడున్న దేవుడికి కూడా భక్తిశ్రద్ధలతో విశ్వాసంగా ఉంటుంది*
విశ్వాసం అనేది మనిషికి సంభందించింది కాదు, మనసుకు సంభందించింది, మనుషులకన్న మూగజీవాలే తమ విశ్వాసం ఇలా గుర్తుచేస్తుంటాయి
మనిషి తన స్వార్థం కోసం దేవుళ్లను వేడుకుంటాడు, నాకు ఆస్తులు ఇవ్వాలని,కోట్లు గడించాలని,అంతస్తులు పెరగాలని,ఆరోగ్యంగా ఉంచాలని,కోరిన ప్రతి కోరిక తన ఉనికిని తన బ్రతుకును కాపాడుకోవటం కోసమె,కానీ మూగజీవమైన ఈ శునకం మనిషిపట్ల విశ్వాసం మాత్రమె చూపించటం లేదు,దేవుడి పట్ల ఎనలేని భక్తతో నిత్య పూజలు చేస్తుంది.