షాక్: డ్రగ్స్ రాకెట్లో సినీ నిర్మాత, దర్శకుడు(పిక్చర్స్)
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాదులో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ డ్రగ్ రాకెట్లో ఓ సినీ ప్రొడ్యూసర్, ఓ సినీ నిర్మాత పట్టుబడటం గమనార్హం. నలుగురు నైజీరియన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఓ సినీ దర్శకుడు, నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డిసిపి వెంకటేశ్వర రావు వెల్లడించారు.
మూడు రోజలు క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువ నిర్మాత సుశాంత్ రెడ్డి, దర్శకుడు రవి కుమార్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు.
డ్రగ్ రాకెట్
జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాదులో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ డ్రగ్ రాకెట్లో ఓ సినీ ప్రొడ్యూసర్, ఓ సినీ నిర్మాత పట్టుబడటం గమనార్హం. నలుగురు నైజీరియన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్ రాకెట్
డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఓ సినీ దర్శకుడు, నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డిసిపి వెంకటేశ్వర రావు వెల్లడించారు.
డ్రగ్ రాకెట్
మూడు రోజలు క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువ నిర్మాత సుశాంత్ రెడ్డి, దర్శకుడు రవి కుమార్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు.
డ్రగ్ రాకెట్
వీరిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి నైజీరియా దేశానికి చెందిన సుల్తాన్(29), శ్యాంసన్ ఏ బూపా(24), ఉజర్ ప్రామిస్(29), అటూబఖ్ బోషా(33)ను అరెస్టు చేశారు.
డ్రగ్ రాకెట్
వారి నుంచి వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్, తొమ్మిది ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ రాకెట్
పోలీసుల విచారణలో కొంత కాలంగా నైజీరియా దేశస్థుల వద్ద మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ సినీ పరిశ్రమలోని పలువురికి అందిస్తున్నట్లు తేలింది.
డ్రగ్ రాకెట్
ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు విక్టర్, ప్యాక్రిక్ పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని సైతం అరెస్టు చేస్తామని చెప్పారు.
డ్రగ్ రాకెట్
చదువు ముసుగులో నగరంలో నివసిస్తున్న నైజీరియన్లు.. ముంబాయి, గోవ వంటి ప్రదేశాల నుంచి మాదకద్రవ్యాలను నగరానికి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.