హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడి

|
Google Oneindia TeluguNews

ఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీశారు కొందరు పాత నేరస్తులు. గతంలో డ్రగ్స్ దందా చేసి కేసులు కూడా నమోదు అయిన పాత నేరగాళ్ళు ఇప్పుడు మరోమారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.

లాక్ డౌన్ వేళ ఏపీలో కొనసాగుతున్న అక్రమ దందాలు.. పోలీసులకు ఇదో పరేషాన్లాక్ డౌన్ వేళ ఏపీలో కొనసాగుతున్న అక్రమ దందాలు.. పోలీసులకు ఇదో పరేషాన్

కరోనా మాస్కుల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ ..54 గ్రాముల కొకైన్ స్వాధీనం

కరోనా మాస్కుల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ ..54 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు తాజాగా ఇద్దరూ డ్రగ్స్ మాఫియా సభ్యులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నిర్వహించిన నైజీరియన్ మైక్ నుండి వారు 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన పరంజ్యోతి సింగ్,అమిత్ కుమార్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా, కరోనాను అడ్డు పెట్టుకొని డ్రగ్స్ దందా సాగించారు.

డ్రగ్స్ దందాపై సినీ ప్రముఖులతో పాటు 300 మందిపై నిఘా

డ్రగ్స్ దందాపై సినీ ప్రముఖులతో పాటు 300 మందిపై నిఘా


కోవిడ్ పాసులు తీసుకొని ఎన్ 95 మాస్కులు తీసుకువస్తున్నట్లుగా నమ్మించి,మాస్కుల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నారు.ఇక వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వీరు హైదరాబాద్ లోనే కాకుండా, బెంగళూరు లోనూ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో మరో కీలక విషయం కూడావెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందా వ్యవహారంలో 300 మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ మూడు వందల మందిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉండటం ఆయా వర్గాలకు టెన్షన్ పుట్టిస్తుంది.

Recommended Video

NTR Meera Chopra Row : Meera Chopra Supporters Demand NTR's Explanation
డ్రగ్స్ ముఠా కాల్ డేటా,వాట్సప్ డేటా డిలీట్ .. రిట్రీవ్ చేస్తున్న అధికారులు

డ్రగ్స్ ముఠా కాల్ డేటా,వాట్సప్ డేటా డిలీట్ .. రిట్రీవ్ చేస్తున్న అధికారులు

ఇప్పటివరకు అమిత్, పరంజ్యోతిలను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి కాల్ డేటాను,వాట్సాప్ చాటింగ్ లను పరిశీలించే పనిలో ఉన్నారు. ఇక ఇద్దరూ మొబైల్ లోని కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ లను డిలీట్ చేయడంతో డేటారిట్రీవ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భాగ్యనగరంలో చాపకింద నీరులా కరోనాతో విలవిలలాడుతున్న ఈ సమయంలో కూడా డ్రగ్స్ దందా మూడు ప్యాకెట్ల కొకైన్, ఆరు ప్యాకెట్ల ఎండిఎంగా జోరుగా సాగుతూనే ఉంది.

English summary
The Excise Police have arrested two men who were carrying drugs in the guise of N95 masks with Covid passes and were selling drugs not only in Hyderabad but also in Bangalore. Excise officials have reported surveillance of 300 people, including film celebrities, in the drug dealing scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X