డ్రంక్ అండ్ డ్రైవ్: మత్తులో యువతి వీరంగం, పోలీసులకు చుక్కలు
Recommended Video
హైదరాబాద్: నగరంలోని రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నవారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక, మద్యం మత్తులు డ్రైవింగ్ చేస్తూ యువతులు కూడా పోలీసులకు చిక్కుతుండటం గమనార్హం.
డ్రంక్ అండ్ డ్రైవ్: కారు ప్రమాదంలో సస్పెండైన బాసర టెంపుల్ మాజీ ఉద్యోగి మృతి
తాజాగా, మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లో ఓ యువతి మద్యం సేవించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
79మంది అరెస్ట్, కార్లు, బైకులు..
ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 79 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 34 కార్లు, 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
యువతి వీరంగం
ఈ క్రమంలో జూబ్లీహిల్స్లో ఓ యువతి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిగింది. కొద్దిసేపు వీరంగం సృష్టించింది.
చుక్కలు చూపింది..
బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా చుక్కలు చూపింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
చివరకు కేసు నమోదు
చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో అనేక ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబులకు చైతన్యం రాకపోవడం శోచనీయం. న్యూఇయర్ వేడుక(జనవరి 1న రాత్రి)ల్లో కూడా భారీ ఎత్తున మందుబాబులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.