ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ ర్యాంకింగ్ లో తెలుగు రాష్ట్రాలే టాప్
హైదరాబాద్ :ఈ.జ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ ర్యాంకింగ్ లో తెలుగురాష్ట్రాలు మొదటి స్ఠానాల్లో నిలిచాయి.గత ఏడాది కంటే ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకొని తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ప్రథమస్థానంలో నిలిచిన గుజరాత్ ఈ ఏడాది మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లను సోమవారం నాడు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిల్లీో ప్రకటించారు.98.78 ర్యాంకులతో తెలంాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి.3వ, స్థానంలో గుజరాత్, 4వ, స్థానంలో చత్తీస్ ఘడ్,5వ, స్థానంలో మద్యప్రదేశ్ నిలిచాయి.
2016 సంవత్సరానికి గాను ఆయా రాష్ట్రాల్లో వాణిజ్య వ్యాపార రంగాల్లో సంస్కరణల అమలుపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నివేదికను విడుదల ేశారు. ఈ నివేదికలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు అద్చుతమైన ఫలితాలను సాధించాయి. 2015 నుండి ఈ ర్యాంకులను కేంద్రం విడుదల చేస్తోంది.
సంస్కరణల ఆదారంగా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా కేంద్ర వాణిజ్య శాఖ విభజించింది. 2015 లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రెండో ర్యాంకు వచ్చింది.ఈ ఏడాది ఎపికి ప్రథమస్థానం వచ్చింది.గత ఏడాది తెలంగాణకు 13 ర్యాంకు వచ్చింది.ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.గత ఏడాదితో పోలీస్తే తెలంగాణ రాష్ట్రం 12 పాయింట్లు ఎగబాకింది.